పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఎన్ఏసీ శిక్షణ కేంద్రం వద్ద జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె. సంజీవరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి. అరుణ్బాబు ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా జాబ్మేళా ఏర్పాటు చేసినట్టు వివరించారు.