ప్రజలకు రోగాలు అంటగడుతున్న మున్సిపల్ అధికారులు..

53చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు నుండి చందోలు వెళ్లే ప్రధాన రహదారి (డంపు యార్డ్ పక్కన) మార్జిన్ లో పొన్నూరు పట్టణంలోని వ్యర్ధాలను మున్సిపల్ అధికారులు కుప్పలు తెప్పలుగా పడవేస్తున్నారు. వందలాది వాహనదారులు ఈ రహదారిలో ప్రయాణం చేస్తుంటారు. వ్యర్ధాల దుర్వాసనకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. వ్యర్ధాల వలన వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రక్కన ఉన్న కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్