వ్యర్ధాలు తొలగించండి మహాప్రభో..

587చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని మాతృ శ్రీ లక్ష్మీకాంతమ్మ ఆశ్రమం ముందు వారం రోజుల నుంచి వ్యర్ధాలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. అమ్మవారి ఆశ్రమానికి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆశ్రమం నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యర్ధాలను తొలగించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్