నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన కలెక్టర్

53చూసినవారు
నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన కలెక్టర్
వరదల కారణంగా నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలకు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ నిత్యావసర సరుకులు గురువారం పంపిణీ చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం, తుళ్లూరు మండలంలోని ఫిషర్ మెన్ కాలనీకి చెందిన 130 మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం, కేజీ పంచదార, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు అందించారు.

సంబంధిత పోస్ట్