వినుకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ నాగూర్ బాషాను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బుధవారం నియమించారు. రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు దాదా గాంధీ నియమించారని నాగూర్ తెలిపారు. ఈ సందర్భంగా షేక్ నాగూర్ మాట్లాడుతూ. నాకు పదవి రావడానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ,ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.