విత్తనాల దుకాణాలలో తనిఖీలు

61చూసినవారు
విత్తనాల దుకాణాలలో తనిఖీలు
వినుకొండ పట్టణంలోని విత్తనాల దుకాణాలను సత్తెనపల్లి ఏడిఎఎస్. శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు నిర్వహించినట్లు మండల వ్యవసాయాధికారి అంజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆథరైజ్డ్ సర్టిఫికెట్ పొందిన విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని సూచించారు. ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్