పులివెందుల: 150 మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్

68చూసినవారు
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పులివెందుల పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ తో పాటు నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, 150 మంది సిబ్బందితో కలసి పులివెందుల పట్టణం నగరి గుట్టలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం 20 బైక్స్, సరైన పత్రాలు లేని నాలుగు ఆటోలు, 50 లీటర్లు నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్