కాంగ్రెస్ కు పునర్వైభవం ప్రారంభమైంది: తులసిరెడ్డి

593చూసినవారు
జిల్లాలో గత 4 రోజులుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ప్రారంభమైందన్నారు. తెలంగాణ తరహాలో 9 గ్యారంటీ పథకాలతో ఏపీలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్