రాజంపేట నియోజకవర్గంలోని రాజంపేట రూరల్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ భువనగిరి లక్ష్మీ నరసింహ స్వామిని మాజీ ఎంపీ, ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ నిర్వహకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.