AP: రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలుపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించింది. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి రూ.200 యూనిట్లు, మర మగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్లు, నాయీ బ్రహ్మణుల సెలూన్లకు రూ.200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందించనుంది. దీనికోసం బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించింది.