వెంకటేశ్వర స్వామి రథోత్సవం

1048చూసినవారు
అమలాపురం వెంకటేశ్వరస్వామి వారి రథోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి రథం వరకు పల్లకిలో తీసుకొనివచ్చి రథంపై అలంకరణ చేశారు. పూలమాలలు, పచ్చని తోరణాలతో రథాన్ని అలంకరించారు. అనంతరం రథం బయలు దేరేముందు కాపు నాయకులు అబ్బిరెడ్డి సురేష్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రథోత్సవాన్ని ప్రారంభించారు. బీజేపీ నేత నల్లా పవన్ రథానికి పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్