ఐదేళ్ల అవినీతి పాలన సాగించిన వైసీపీని ప్రజలు ఎన్నికల్లో తరిమి కొట్టాలని అమలాపురం ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు పిలుపునిచ్చారు. అమలాపురం రూరల్ లో శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తనతో పాటుగా ఎంపీగా గంటి హరీష్ మాధుర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.