సీఎం సహాయ నిధికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ. 5లక్షల విరాళం

80చూసినవారు
విజయవాడ వరద బాధితుల సహాయార్థం అనపర్తి ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 5లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా అనపర్తి మండలం రామవరం లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఆదివారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్రి వెంకటరెడ్డి, సెక్రటరీ రామమూర్తి రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ మిల్లర్లతో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అభినందించారు.

సంబంధిత పోస్ట్