వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న రాజమండ్రి ఎంపీ

54చూసినవారు
వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న రాజమండ్రి ఎంపీ
ప. గో జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్