కాట్రేనికోన మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కుండలేశ్వరం వద్ద గోదావరిలో స్నానానికి దిగి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. కాకినాడ రామారావుపేటకు చెందిన రుత్తాల కృష్ణ, జానకి దంపతులు సోమవారం కుండలేశ్వరం దైవ దర్శనానికి వచ్చారు. కృష్ణ గోదావరిలోకి స్నానానికి దిగి గల్లంతయ్యాడు. దీంతో భార్య కేకలు వేసి బోరున విలపించింది. కాట్రేనికోన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్థానికంగా ఉండే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.