మురముళ్ల ఆలయానికి ఐఎస్ఓ ధ్రువీకరణ

57చూసినవారు
ఐ. పోలవరం మండలం మురముళ్ల వీరేశ్వర స్వామి ఆలయానికి ఐసీఎల్ సంస్థ రెండు ఐఎస్ఓ ధృవీకరణ పత్రాలను మంజూరు చేసింది. శుక్రవారం ఆలయ సహాయ కమిషనర్ కార్య నిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, పర్యవేక్షణ అధికారి కటారి శ్రీనివాసరాజుకు సంస్థ ప్రతినిధి సుబ్రహ్మణ్యం పత్రాలను అందజేశారు. ఐదేళ్లుగా ఆలయ అభివృద్ధికి కృషి చేసిన ఈవోను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో పాటు స్థానికులు, భక్తులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్