రాజమండ్రి ది ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు శుక్రవారం కడియం మండలంలోని జేగురుపాడులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్రావుకు ఓట్లు వేసి గెలిపించాలని ప్యానల్ సభ్యులు అభ్యర్థించారు. ఈ ప్రచారంలో కొండలరావు, రాజమండ్రి 22వ వార్డు ఇంఛార్జ్ జగదీష్, ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణలు పాల్గొన్నారు.