రాజమండ్రి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజా దర్బార్‌’

74చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజా దర్బార్‌’ కార్యక్రమం అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి నగరంలోని కొత్తపేటలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ లో వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్