తూ. గో జిల్లావ్యాప్తంగా 220 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

67చూసినవారు
ఖరీఫ్ సీజన్ ధాన్యాన్ని కనుగోలు చేసేందుకు తూ. గో జిల్లా వ్యాప్తంగా 220 ధాన్యం కనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు తెలిపారు. ధాన్యం కనుగొలు ప్రక్రియపై ఆయన రాజమండ్రి రెవిన్యూ డివిజన్ పరిధిలోని అధికారులతో రాజమండ్రి ఆనం కళా కేంద్రం వద్ద శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ ధాన్యం కనుగోలు ప్రక్రియను నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్