మహిళపై దాడి.. ఐదుగురికి జైలు శిక్ష

61చూసినవారు
మహిళపై దాడి.. ఐదుగురికి జైలు శిక్ష
మహిళను అగౌరవపరచి, గాయపరచిన కేసులో రాజోలు జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు ఐదుగురు వ్యక్తులకు ఏడాది పాటు జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించారని రాజోలు ఎస్ఐ రాజేశ్ కుమార్ తెలిపారు. 2019లో రాజోలు మండలం సోంపల్లి గ్రామానికి చెందిన మహిళను డ్రైనేజీ విషయంలో ఐదుగురు వ్యక్తులు అగౌరవ పరచడంతో పాటు, తనను కొట్టారని రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందన్నారు.

సంబంధిత పోస్ట్