తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే దేవ

66చూసినవారు
రాజోలు నియోజకవర్గంలో జటిలంగా ఉన్న తాగునీటి సమస్య ను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. మలికిపురం మండలం లక్కవరం వేణుగోపాల పేటలో రూ. 37. 4 లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి పథకాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి తాగునీరు అందించేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు. దీని కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్