సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేలా ప్రతి ఒక్కరు ఆయనకు మద్దతుగా నిలిచి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కుమార్తెలు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కుమార్తెలు సహజ, ఉజ్వల, నిశ్చల తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.