ప్రభుత్వ ప్యాకేజీపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ హర్షం

77చూసినవారు
వరద నేపథ్యంలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఘంటసాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో కనివినీ ఎరుగని స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయ ప్యాకేజీ ప్రకటించిందన్నారు. దెబ్బతిన్న ఇళ్లకు, అన్ని రకాల పంటలకు పెద్దఎత్తున పరిహారం ప్రకటించటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నష్టంలో ఉన్న వారికి ఉపశమనం కలిగించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్