మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశ్రాంత ఐఏఎస్ అధికారి రఘురాం మంగళవారం దర్శించుకున్నారు. రెవిన్యూ శాఖలో ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన రఘురాం ఆలయానికి వచ్చారు. రఘురాంతో పాటు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అల్లుడు, నియోజకవర్గ ప్రముఖులు శీలం అశ్విన్ కుమార్ ఆలయ ఆవరణలో నాగ పుట్టలో పాలు పోశారు.