శ్రీ సాయి కోటి నామ పుస్తకాలు ఊరేగింపు

71చూసినవారు
శ్రీ సాయి కోటి నామ పుస్తకాలు ఊరేగింపు
నాగాయలంక మండలంలోని నంగేగడ్డ గ్రామంలోని శ్రీ అమ్ముల షిరిడీ సాయి ఆశ్రమంలో స్వామి వారి పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం పదికోట్ల శ్రీ సాయి నామములు పుస్తకాలను ప్రత్యేక వాహనంలో వుంచి నంగేగడ్డ, చోడవరం, నాగాయలంక, మర్రిపాలెం తదితర గ్రామాలలో సాయి భక్తులు సాయినామ స్మరణను చేస్తూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్