కృష్ణాజిల్లా మచిలీపట్నంలో శుక్రవారం వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కృష్ణమూర్తి, నగర పాలక సంస్థ మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని మహిళలకు చేయూతను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నాలుగో విడత నిధులను మహిళల ఖాతాల్లో జమ చేశారు.