కొండపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి

59చూసినవారు
కొండపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి
కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను సోమవారం విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిని కలిశారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజలకు సత్వర సేవలను అందించడంలో కలుగుతున్న ఇబ్బందులను వివరించారు.

సంబంధిత పోస్ట్