ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1న ఏలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను మరియు హెలిపాడ్ స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆళ్ల నాని మంగళవారం పరిశీలించారు. అలాగే జగన్ పర్యటనను నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు విజయవంతం చేయాలని కోరారు.