గన్నవరం: ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

80చూసినవారు
గన్నవరం: ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన ఆదివారం గన్నవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. గన్నవరం మండలం మాదలవారిగూడెం లింగయాస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు స్థానిక గోతుల్లో ఈతకు వెళ్లారు. క్వారీ గుంతల్లో లోతు ఎక్కువ ఉండడంతో ఈత కొడుతూ మునిగిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు పగడాల దుర్గాప్రసాద్ (తిరువూరు), జగ్గరాజు వెంకటేశ్ రాజు(హైదరాబాద్)గా గుర్తించారు.

సంబంధిత పోస్ట్