కైకలూరులో పోలీసుల కవాతు

565చూసినవారు
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలంతా సహకారం అందించాలని కైకలూరు రూరల్ సీఐ ఆకుల రఘు కోరారు. కైకలూరు మండలంలోని వేమవరప్పాడు, వింజరం, తామరకొల్లు గ్రామాల్లో ఆదివారం సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, అందుకు పోలీసులు, ప్రత్యేక బలగాలు అండగా ఉంటాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై ఎం. అర్ కే. రాజు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్