చంద్రబాబు నివాసంపై దాడికేసులో జోగి అనుచరుల విచారణ

68చూసినవారు
చంద్రబాబు నివాసంపై దాడికేసులో జోగి అనుచరుల విచారణ
తాడేపల్లి పరిధి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న జోగి రమేశ్ అనుచరులు రాము, అనిల్ కుమార్, చిన్ని, సుబ్బారావు, మధుబాబు, మాధవరావులు గురువారం మంగళగిరిలోని డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా న్యాయవాదుల సమక్షంలో వారు విచారణకు హాజరైయ్యారు. వారిని డీఎస్పీ మురళీ కృష్ణ విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్