చాట్రాయిలో జ్వరంతో యువకుడు మృతి

72చూసినవారు
చాట్రాయిలో జ్వరంతో యువకుడు మృతి
నూజివీడు నియోజవర్గంలోని చాట్రాయి మండలం గొల్లగూడెంలో అనారోగ్యంతో యువకుడు మృతిచెందాడు. మండల కేంద్రమైన చాట్రాయి గొల్లగూడెంకు చెందిన అప్పారావు కుమారుడు ఆనంద్ శనివారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని చాట్రాయి తీసుకురావడంతో ప్రజలు తరలివచ్చారు. టీడీపీ బీసీ సెల్ నాయకులు చెన్నారావు, శంకర్, జనసేన నాయకుడు శివశంకర్ పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేశారు.

సంబంధిత పోస్ట్