ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలి: ఎమ్మెల్యే

68చూసినవారు
ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలి: ఎమ్మెల్యే
సాతులూరు గ్రామంలో కాల్వకు ఇరువైపులా ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు, మండల నాయకులకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సూచించారు. శుక్రవారం బంటుమిల్లి మండలంలోని బంటుమిల్లి కెనాల్ కు వరదనీరు చేరడంతో కాలువ ప్రవాహస్థాయిని సాతులూరు గ్రామంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఇప్పటివరకు 700 క్యూసెక్కుల నీరు విడుదల అయ్యాయని, ఇంకా అధికంగా క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు తెలిపారు

సంబంధిత పోస్ట్