రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ బుధవారం ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుక అయిన రంజాన్ పర్వదినాన్ని ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని జోగి రమేష్ ఆకాంక్షించారు.