గంపలగూడెం మండలం పెనుగొలనులో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో మార్చి 2వతేదీ ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో వైద్యులు కంటి, డెంటల్, షుగర్, బిపి, జనరల్ మొదలైన రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తిరువూరు శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ డి. ప్రభాకర్ రావు శనివారం తెలిపారు.