శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు జరుగుచున్న చైత్రమాస బ్రహ్మోత్సవములలో భాగంగా బుధవారం ఆలయ ఈవో కె ఎస్ రామరావు ఆధ్వర్యంలో వైదిక సిబ్బంది మరియు ఆలయ అర్చకులచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఊరేగింపుగా దుర్గాఘాట్ చేరుకొని వేదమంత్రోచ్ఛరణల నడుమ పవిత్ర కృష్ణా నదీ తీరం నందు అవభృత స్నానం శాస్త్రోక్తముగా కార్యక్రమములు నిర్వహించారు.