విజయవాడ సీపీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత

78చూసినవారు
విజయవాడ సీపీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో వేముల దుర్గారావును చూపించాలంటూ. విజయవాడ పాయకాపురం వడ్డెర కాలనీవాసులు సీపీ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. దుర్గారావును ఆరు రోజులుగా చూపించడం లేదంటూ సీపీ కార్యాలయం గేట్ ముందు వారు బైఠాయించారు. సమాచారం అందుకున్న సూర్యారావుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చర్చలు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్