పోలింగ్ కేంద్రాల్లో రెండు రోజుల ముందే పోలింగ్ నంబరు, ఓటర్ల సంఖ్య తదితర వివరాలు ఉంచాలని ఎన్నికల అబ్జర్వర్ మిర్ తారిఖ్ అలీ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆదోని మండలం గ్రామాల్లోని 20 పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. వంద మీటర్ల దూరం వరకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ఒకే చోట రెండు పొలింగ్ కేంద్రాలుంటే బారికెడ్లు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.