ఆస్పరి మండలం చిగిలి, వలగొండ, పుట్టుకల మర్రి, ముత్తుకూరు, బిల్లేకల్ గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే నాకు ఓటు వేయండి అని ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమానికి జెసి ఎస్ జిల్లా కన్వీనర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి, కురువ సంఘం నాయకురాలు శశికళ పాల్గొన్నారు.