సుంకేసుల డ్యాంకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

70చూసినవారు
తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 38, 277 క్యూసెక్కుల నీటి ఇన్ ఫ్లో ఉండగా, జలాశయం నుంచి 8 గేట్లను ఎత్తి 35, 832 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు జలాశయం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. కాల్వకు 2, 445 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు, ప్రస్తుతం జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

సంబంధిత పోస్ట్