కర్నూలు రూరల్ మండలం ఉల్చాల గ్రామానికి చెందిన వంద మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. కర్నూలులో విష్ణువర్ధన్రెడ్డి వీరికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో బోయ నాగార్జున, ఖాజాహుసేన్, బోయశ్రీను, బోయసుంకన్న, అల్లాబకాష్, వెంకటేష్, అంజి, గిడ్డయ్య, హనుమంతు, విజయుడు, రాఘవేంద్ర, మౌలాలి, సత్యం బాబు, రామాంజనేయులు, రాముడు, కరీమ్, రమేష్ ఉన్నారు.