శ్రీ మఠంలో ఇంటలిజెన్స్ ఎస్పీ

68చూసినవారు
శ్రీ మఠంలో ఇంటలిజెన్స్ ఎస్పీ
కర్నూలు జిల్లా మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో విజయవాడ ఇంటలిజెన్స్ ఎస్పీ లత మాధురి గురువారం విచ్చేశారు. వీరికి ముందుగా శ్రీ మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు తదనంతరం గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్నికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వీరి వెంట మంత్రాలయం ఎస్ఐ గోపీనాథ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్