సాగు తాగునీరు అందించి వలసలు ఆపుతాం

68చూసినవారు
సాగు తాగునీరు అందించి వలసలు ఆపుతాం
కోసిగి మండలంలో సాగు తాగునీరు అందించి వలసలు ఆపుతామని మంత్రాలయం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణ దొర అన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీ కోసిగి ఎల్లమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోసిగిలో పలు కాలనీల్లో ప్రచారం చేస్తూ కాంగ్రెసు పార్టీకి ఓటు వేయాలని కోరారు. వామపక్ష నేతలు మల్లయ్య, తిక్కన్న, రాముడు, వీరేష్, భాస్కర్ యాదవ్, గోపాల్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్