75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రభుత్వ సిబ్బందికి శుక్రవారం నాడు కలెక్టర్ మన్జిర్ జిలాని సామున్ చేతుల మీదుగా కమాండేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఇందులో గడివేముల మండలం నుంచి రి సర్వే డిప్యూటీ తాసిల్దారు బుర్గన్న, పోలీసు కానిస్టేబుల్ రామాచారి, ఈవో ఆర్ డి అబ్దుల్ కాలిక్ లు ఉన్నారు. ఈ గౌరవం అందుకోవడం పై వారు ఆనందం వ్యక్తం చేశారు.