ఓర్వకల్లులో ఘనంగా గణనాధుల నిమజ్జనం

80చూసినవారు
పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో మూడు రోజుల పాటు భక్తుల నుంచి పూజలు అందుకున్న గణనాథులు సోమవారం గంగమ్మ ఒడికి చేరుకున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 120 విగ్రహాలను కొలువుంచారు. గణనాథులను ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ సమీపంలోని చెరువులు, కుంటలు, వాగుల్లో నిమజ్జనం చేశారు. ఎస్సై సునీల్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్