గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
By W. Abdul 67చూసినవారుతనను ఆదోని ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే అందుబాటులో ఉండి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఇండియా కూటమి బలపరచిన ఆదోని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ యాదవ్ అన్నారు. సోమవారం హనుమాన్ నగర్, నిజాముద్దీన్ కాలనీ, గణేకల్, పెద్దతుంబళం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రమేష్ యాదవ్ను స్థానికులు బాణసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు.