ఎన్నికల్లో భాగంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో గురువారం ఆదోని పట్టణంలో పోలీసు కవాతు నిర్వహించారు. సెంట్రల్ ఫోర్స్, ఎస్ఎస్బి పోలీసులు ఆదోనిలోని భీమాస్ సర్కిల్ మీదుగా ఎస్కెడి కాలనీలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లకు భరోసా కల్పించడమే ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశ్యమని డీఎస్పీ అన్నారు.