ఆదోని మండలం మదిరె గ్రామంలో తాగు నీరులేక దాదాపు 30 రోజులుగా అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు పేర్కొంటున్నారు. మంగళవారం ఆదోని నుంచి నీటిని తీసుకెళుతున్న గ్రామస్థుడు ఆవేదన వ్యక్తం చేశారు. మదిరె గ్రామం ఆదోని నుంచి పది కలోమీటర్లు దూరంలో ఉందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా గ్రామానికి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.