రైతులకు కొర్ర, కంది విత్తనాలు పంపిణీ

55చూసినవారు
రైతులకు కొర్ర, కంది విత్తనాలు పంపిణీ
కోడుమూరు మండలంలోని రైతులకు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా మంజూరైన కొర్ర, కంది విత్తనాలను ఏవో రవిప్రకాష్ సోమవారం రైతులకు అందజేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఐసిపిల్ 87119 రకం కంది విత్తనాలు కిలో రూ. 98, ఎస్ఐఏ 3156 రకం కొర్రలు రూ. 44తో రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. కోడుమూరు మండలం గ్రామాల్లోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో రవిప్రకాష్ సూచించారు.

సంబంధిత పోస్ట్