వ్యవసాయ పనిముట్లను సద్వినియోగం చేసుకోండి

54చూసినవారు
రైతులు వ్యవసాయ పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ సబ్ ప్లాన్ ఛైర్మన్ బాలకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దకడబూరు మండలంలోని హెచ్ మురవణిలో ఏఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సీ సబ్ కింద రైతులకు పనిముట్ల పంపిణీలో భాగంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని గుర్తు చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ పథకం కింద రైతులకు అందజేసే పనిముట్లు వ్యవసాయ సాగుకు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్